దైవ దర్శనానికి తీసుకెళ్లలేదని మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-07-03T05:07:52+05:30 IST
దైవదర్శనానికి కొడుకు తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురైన తల్లి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.
నాగర్కర్నూల్ క్రైం, జూలై 2 : దైవదర్శనానికి కొడుకు తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురైన తల్లి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో శని వారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంగమ్మ(45), కొడుకు బాలరాజు కోడలు సునీత వేరు కాపురం ఉన్నా రు. అయితే గత నెల 25న బాలరాజు, సునీత శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వచ్చారు. విషయం తెలిసిన మంగమ్మ కొడుకు, కోడలితో తననేందుకు తీసుకెళ్లలే దని గొడవ పడింది. తాము వేరు కాపురం ఉన్నామని నీకు చెప్పాల్సినవసరం మాకు లేదంటూ కొడుకు, కోడలు వాగ్వాదానికి దిగారు. దాంతో మనస్తా పానికి గురైన మంగ మ్మ ఇంట్లో తన భర్త శ్రీనివాస్కు ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ తీసుకొని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పై తూడుకుర్తి గ్రా మంలో ఉంటున్న మృతురాలి తండ్రి చెన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.