కక్ష సాధింపు కాదు...అభివృద్ధిలో పోటీపడండి

ABN , First Publish Date - 2021-08-06T05:14:44+05:30 IST

అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప కక్ష సాధింపులు తగవని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు వైఖరి మార్చుకోవాలని టీడీపీ నాయకులు హితవుపలికారు.

కక్ష సాధింపు కాదు...అభివృద్ధిలో పోటీపడండి
పలాసలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

  వైసీపీ నాయకులకు టీడీపీ హితవు

పలాస: అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప కక్ష సాధింపులు తగవని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు వైఖరి మార్చుకోవాలని  టీడీపీ నాయకులు హితవుపలికారు. గు రువారం పలాసలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయ కులు సోషల్‌మీడియా వేదికగా చేస్తున్న వికృతచేష్టలు మానుకోవాలన్నారు.  తమ పార్టీ నాయకురాలు గౌతు శిరీషపై పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈవిష యంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, తమ్మినాన గంగారామ్‌, సప్ప నవీన్‌, టంకాల రవిశంకర్‌ గుప్తా పాల్గొన్నారు. మందస: మహిళలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదని టీడీపీ నాయకులు తెలిపారు.  మందసలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దాసరి తాతారావు విలేకరులతో మాట్లాడుతూ  వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అటకెక్కిందన్నారు.  టీడీపీ మండలాధ్యక్షుడు భావన దుర్యోధన, రట్టి లింగరాజు, టి.భాస్కరరావు పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు: గౌతు శిరీషను కించపరిచే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టులుపెడుతున్న  వైసీపీ సోషల్‌ మీడియాను మంత్రి అప్పలరాజు అదుపుచేయాలని టీడీపీ మండల నాయకులు డిమాండ్‌ చేశారు. వజ్రపుకొత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ  పలాసలో సోషల్‌ మీడియాపై రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతున్నా  మంత్రి స్పందించకపోవడం శోచనీ యమన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు సూరాడ మోహనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సాంబమూర్తి,  బి.శశిభూషణ్‌, మరడ ధుర్యోధన రెడ్డి పాల్గొన్నారు.

  



Updated Date - 2021-08-06T05:14:44+05:30 IST