నూకాలమ్మను దర్శించుకున్న శ్యామలానంద
ABN , First Publish Date - 2021-10-26T04:45:51+05:30 IST
జంగారెడ్డిగూడెం నూకాలమ్మను విశాఖ రాజమాతంగి పీఠాధిపతి శ్యామలానందనాథ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం, అక్టోబరు 25: జంగారెడ్డిగూడెం నూకాలమ్మను విశాఖ రాజమాతంగి పీఠాధిపతి శ్యామలానందనాథ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దివ్య దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేషవస్త్రం, చిత్రపటం అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. చిటికెన రాంబాబు, సభ్యులు పాల్గొన్నారు.