తొమ్మిది మందిపై నాన్బెయిలెబుల్ కేసు నమోదు
ABN , First Publish Date - 2020-06-07T11:06:51+05:30 IST
భుక్తాపూర్కు చెందిన సిలివేరి శ్రీనివాస్పై దాడి ఘటనలో తొమ్మిది మందిపై నాన్బెయిలెబుల్ కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ
ఆదిలాబాద్ టౌన్, జూన్ 6: భుక్తాపూర్కు చెందిన సిలివేరి శ్రీనివాస్పై దాడి ఘటనలో తొమ్మిది మందిపై నాన్బెయిలెబుల్ కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో సంచలనం రేపిన దాడి కేసును చాలెంజ్గా తీసుకొని ప్రధాన నిందితులైన టీఆర్ఎస్ కౌన్సిలర్తో సహా ఏడుగురిని అరెస్టు చేయడంతో పాటు ఆయుధాలు, మూడు కార్లను స్వాధీనం చేసకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం రెండు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయన్నారు. అరెస్టు చేసిన వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించి జైలుకు తరలించినట్లు తెలిపారు.