పునరుద్ధరణ ఏదీ...?

ABN , First Publish Date - 2022-08-17T05:13:59+05:30 IST

మండలంలో 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు 100 కేవీ, చిన్న చిన్న విద్యుత ట్రాన్సఫార్మర్లు నీటిలో కొట్టుకు పోగా.. మరికొన్ని నేల కూలాయి.

పునరుద్ధరణ ఏదీ...?
రుద్రపాదాశ్రమం వద్ద నీటిలో ఉన్న ట్రాన్సఫార్మర్‌

 

ఇటీవల వర్షాలకు నీటిలో కొట్టుకుపోయిన ట్రాన్సఫార్మర్లు

మరికొన్ని కూలిన వైనం.. నీరు  అందక ఎండుతున్న పంటలు


రొద్దం, ఆగస్టు 16 : మండలంలో 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు 100 కేవీ, చిన్న చిన్న విద్యుత ట్రాన్సఫార్మర్లు నీటిలో కొట్టుకు పోగా.. మరికొన్ని నేల కూలాయి. దీంతో పొలా లకు విద్యుత సరఫరా కావపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సుబ్బరాయప్ప కొట్టాల, రుద్రపాదాశ్రమం వాగు, ఆర్‌.మరువప ల్లి పెద్దవంక, రొద్దం చిన్నచెరువు, ఆయకట్టు కిం ద నాలుగు ట్రాన్సపార్మర్లు నీటిలో కొట్టు కొని పోయాయి. మరికొన్ని కిందపడ్డాయి. ట్రాన్సఫా ర్మర్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంలో అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.  


Updated Date - 2022-08-17T05:13:59+05:30 IST