దేవాలయ భూముల్లో లేఅవుట్లు వద్దు
ABN , First Publish Date - 2020-07-04T10:39:33+05:30 IST
హిందూ ధర్మ పరిరక్షణకు వందల ఏళ్ల క్రితం దాతలు ఆలయాలకు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం కబ్జా చేస్తోందని బీజేపీ నాయకులు
నెల్లూరు (సాంస్కృతికం), జూలై 3 : హిందూ ధర్మ పరిరక్షణకు వందల ఏళ్ల క్రితం దాతలు ఆలయాలకు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం కబ్జా చేస్తోందని బీజేపీ నాయకులు విమర్శించారు. దేవాలయ భూములను ఇళ్ల స్థలాలకు లే అవుట్లుగా వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ మాట్లాడుతూ దేవాలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
దానికి విరుద్ధంగా వెంకటాచలంలో సీతన్న చలివేంద్రం భూమిలో, దగదర్తి మండలం తిరువీధిపాడు దేవుడి కొండను లే అవుట్ చేయడం అన్యాయం అన్నారు. దేవుడి భూములను ఇళ్ల స్థలాలకు తీసుకోవడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవీ సుబ్బయ్య, ఎన్ సుబ్బారెడ్డి, బీ సురేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.