పూల బొకేలు వద్దు.. పుస్తకాలు ముద్దు
ABN , First Publish Date - 2022-07-05T06:03:23+05:30 IST
జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అయితే రెండు రోజుల క్రితం తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురాకుండా, వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు వంటి పిల్లలకు ఉపయోగపడే వస్తువులను తీసుకురావాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.
ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునకు విశేష స్పందన
జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
ఆదిలాబాద్ అర్బన్, జూలై 4: జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అయితే రెండు రోజుల క్రితం తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురాకుండా, వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు వంటి పిల్లలకు ఉపయోగపడే వస్తువులను తీసుకురావాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దమొత్తంలో పుస్తకాలు, పెన్నులు, బ్యాగులతో జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. మరికొందరైతే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పిల్లల కోసం గొడుగులను తీసుకొచ్చి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు వేడుకులలో కార్యకర్తలు, నాయకులు పెద్దమొత్తంలో హాజరవ్వగా అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 500 మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా ముందుగా దుర్గానగర్లోని మీయావాకి ప్లాంటేషన్లో మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ నాయకులు జోగు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్: మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలను మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామమైన మండలంలోని దీపాయిగూడలో గల తన తల్లి జోగు భోజమ్మ ఆశీర్వాదాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న తీసుకున్నారు. వేడుకల్లో భాగంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 156 మంది రక్తదానం చేశారు. ఇందులో ఎంపీపీ ఎం.గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతిరెడ్డి, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ ఎస్.లింగారెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్ ఉన్నారు.
ఆదిలాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు సోమవారం సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఫ్యాక్స్ ద్వారా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందించాలన్నారు.
బోథ్: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలలో ఎంపీపీ తుల శ్రీనివాస్, సహకార సంఘం చైర్మన్ కదం ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.