వైసీపీ పాలన లో అభివృద్ధి శూన్యం: మాజీ ఎమ్మెల్యే కందుల
ABN , First Publish Date - 2022-08-19T04:32:05+05:30 IST
వైసీపి పాలన లో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు.
- మాదాలవారిపాలెంలో బాదుడేబాదుడు
పొదిలిరూరల్, ఆగస్టు 18 : వైసీపి పాలన లో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మాదాలవారిపాలెం గ్రామంలో బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజల నెత్తిన జగన్రెడ్డి రోజుకో ధరల పిడుగును వేస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలపై పన్నుల భారం మోపమని, చార్జీలు పెంచమని నమ్మించిన జగన్రెడ్డి ప్రజ లను చార్జీలతో బాదేస్తున్నారని కందుల ధ్వజ మెత్తారు. టీడీపీ హయంలో ప్రజల బాగో గులతోపాటు సంక్షేమ పథకాలు అందరికీ అం దేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్య లు తీసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ప్రజలు క్షేమంగా రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందని కందుల పేర్కొ న్నా రు. మూడేళ్లలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకో క పోవడంతోపాటు అప్పుల ఊబిలోకి నెట్టార న్నారు. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చేసిన పాపం వైసీపీదేనన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. దీంతో నిరుద్యోగులు మరింత ఎక్కువై ఉపాధి కోసం వలస పోతున్నారని కందుల ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్బందిలేకుండా జరిగిపో తు న్న గృహ నిర్మాణ రంగానికి ఇసుక పాలసీని తెచ్చి అస్తవ్యస్తం చేసిన ఘనత జగన్రెడ్డి దేనని అన్నారు. దీంతో భవన నిర్మాణ కార్మి కులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న దుస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ఏర్పాటు చేసిన కా ర్పొరేషన్ లన్నీ నిధులు లేక నిర్వీర్యమయ్యా యన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని కులాల కార్పొరేషన్ల ద్వారా యువతను ఆదు కుంటామన్నారు. వైసీపీ అసమర్ధ పాలన తో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీపీ సానుభూతి పరులకు పథకాలు అందకుండా చేయడం అన్యాయమన్నారు. వైసీపీ పాలకుల తీరుతో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో అభద్ర తాభావం పెరిగిపోయిందన్నారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కందుల పిలుపునిచ్చారు. కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు మీగడ ఓబుల రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, చినబాబు, పెదబాబు, రసూల్ పండు అనిల్, ఎస్ఎం బా షా, షబ్బీర్, కాటూరి శ్రీను, మౌళాలి, యాసిన్, ఖల్నాయక్, నరేష్, ఠాగూర్, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి టీడీపీ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రం అధోగతి
మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి
కొమరోలు, ఆగస్టు 18 : వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మండలంలోని బాది నేనిపల్లి గ్రామ పంచాయతీలోని క్రిష్టంపల్లి గ్రామంలో బాదుడే బాదు డు కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. భారీ ర్యాలీగా వచ్చిన టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, పెంచుతున్న పన్నులు, ధరలు, చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అశోక్రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నీటి ప్రాజెక్టులను విస్మరించి ఎడారిగా మా ర్చారన్నారు. అభివృద్ధి కావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి కనిపి స్తుందంటే అది టీడీపీ హయాంలో జరిగినదేనని అశోక్రెడ్డి గుర్తు చేశారు. వైసీపీ వచ్చిన మూడేళ్లలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రజలపై వైసీపీ బాదుడుకు అడ్డుకట్ట పడాలంటే జగన్రెడ్డిని ఇంటికి పంపాలని అశోక్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, నాయకులు బిజ్జాల తిరుమలరెడ్డి, ముత్తుముల సంజీవరెడ్డి, ఓబుల్రెడ్డి, గోపా లకృష్ణ యాదవ్, బద్రి లక్ష్మిరంగారెడ్డి, హనుమంతు, యాల్లారెడ్డి, బద్రి నాగేశ్వర్రెడ్డి, రామాంజ నేయులు, రంగయ్య, వెంకట్రామిరెడ్డి, షేక్ నభి, బాలిరెడ్డి, గుర్రం కృష్ణబాబు పాల్గొన్నారు.