తీరంలో దేవుళ్ల భద్రతపై ఆందోళన

ABN , First Publish Date - 2020-09-27T10:27:11+05:30 IST

చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా తీర ప్రాంతం మొదటి నుంచి విశేషమైంది. స్వయంభువుగా వెలసిన దేవుళ్ల ఆలయాలకు ప్రాముఖ్యత ఉంది.

తీరంలో దేవుళ్ల భద్రతపై ఆందోళన

ఇందుకూరుపేట, సెప్టెంబరు 26 : చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా తీర ప్రాంతం మొదటి నుంచి విశేషమైంది. స్వయంభువుగా వెలసిన దేవుళ్ల ఆలయాలకు ప్రాముఖ్యత  ఉంది. అలాంటి తీరంలో దేవాలయాలకు భద్రత ఆందోళన కలిగిస్తుంది.


మైపాడు శివాలయం, సముద్ర తీరం కొరుటూ రు గ్రామంలో అత్యంత పురాతన శివాలయం, ముదివర్తి పాళెం, రాముడుపాళెం, కుడితిపాళెం, ఇందుకూరుపేట, కొమరిక, లేబూరు తదితర అనేక గ్రామాల్లో అత్యంత పురా తనమైన విశిష్టమైన ప్రాముఖ్యత గల ఆలయాలకు ప్రసిద్ధి.


అత్యంత అద్భుతమైన శిల్పకళలతో, వదాన్యులు అందించిన భూ విరాళాలతో ఆర్థికంగా బలమైన ఆలయాలున్నాయి. కానీ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో  భద్రతపై ఆందోళన చెందుతున్నారు. గంగపట్నం తీరంలో చాముండేశ్వరి ఆలయం నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.


దాదాపు రూ.85 వేల వ్యయంతో వదాన్యుల చేయూతతో ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన దుర్గా శంకర్‌రెడ్డి ఆర్థికంగా చేయూతని స్తున్నారు. మిగిలిన ఆలయాలకు కూడా దేవదాయ శాఖ  భద్రత చర్యలు చేపట్టి భక్తుల మనోభావాలు కాపాడాలని కోరుతున్నారు. 

 

Updated Date - 2020-09-27T10:27:11+05:30 IST