హనుమాన్ శోభాయాత్ర: బీజేపీలో బయటపడ్డ విభేదాలు
ABN , First Publish Date - 2022-04-16T18:58:36+05:30 IST
జిల్లా కేంద్రంలోని హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది.
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది. శోభాయాత్రను మొదలు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. అయితే ఎంపి అర్వింద్ వచ్చేదాకా వేచి చూడాలని దన్ పాల్ సూర్యనారాయణ అడ్డుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.