నూతన రైతు వేదిక భవనంలో టీఆర్ఎస్ నేతల మందు పార్టీ

ABN , First Publish Date - 2021-07-19T17:47:10+05:30 IST

నిజామాబాద్ జిల్లా: నిందిపేట్‌లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనం మందు పార్టీకి అడ్డాగా మారింది.

నూతన రైతు వేదిక భవనంలో టీఆర్ఎస్ నేతల మందు పార్టీ

నిజామాబాద్ జిల్లా: నిందిపేట్‌లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనం మందు పార్టీకి అడ్డాగా మారింది. రాత్రి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతు వేదిక భవనంలో మందు పార్టీ చేసుకున్నారు. ఆపై చిందులేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీఆర్ఎస్ నేతల నిర్వాకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కొందరు రైతు వేదిక భవనం వద్దకు వచ్చారు. మందు పార్టీని వీడియో తీస్తున్న క్రమంలో మందుబాబులు పారిపోయారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కాగా సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతు వేదిక నూతన భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

Updated Date - 2021-07-19T17:47:10+05:30 IST