కోవిడ్ నేపథ్యంలో వంద కోట్లు విడుదల చేసిన నితీశ్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-03-26T21:35:03+05:30 IST

కోవిడ్ 19 లాక్‌డౌన్ తో రాష్ట్రానికి తిరిగొచ్చిన, లేదా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీల సహాయార్థం నితీశ్ కుమార్ ప్రభుత్వం

కోవిడ్ నేపథ్యంలో వంద కోట్లు విడుదల చేసిన నితీశ్ ప్రభుత్వం

పాట్నా : కోవిడ్ 19 లాక్‌డౌన్ తో రాష్ట్రానికి తిరిగొచ్చిన, లేదా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీల సహాయార్థం నితీశ్ కుమార్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి గురువారం వంద కోట్లను విడుదల చేశారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆహారంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని కూడా అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.


అంతేకాకుండా పంజాబ్, హర్యానా, ఢిల్లీలో చిక్కుకుపోయిన బిహారీ వాసులకు ఆహారంతో పాటు తగిన వసతులను కూడా కల్పించాలని ఆ ప్రభుత్వాలకు నితీశ్ ప్రభుత్వం విన్నవించుకుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా సహాయార్థుల కోసం ఓ హెల్ప్ లైన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నితీశ్ ఆదేశించారు. 

Updated Date - 2020-03-26T21:35:03+05:30 IST