నిత్య శ్రమజీవి ఎర్రన్నాయుడు

ABN , First Publish Date - 2021-02-24T05:28:53+05:30 IST

ఎర్రన్నాయుడు నిత్య శ్రమజీవి అని..ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమిచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

నిత్య శ్రమజీవి ఎర్రన్నాయుడు
నిమ్మాడలో ఎర్రన్న ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం



 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

కోటబొమ్మాళి, ఫిబ్రవరి 23: ఎర్రన్నాయుడు నిత్య శ్రమజీవి అని..ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమిచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం ఎర్రన్న జయంతి సందర్భంగా నిమ్మాడలో ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు ఎర్రన్న అని అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లో పయనిద్దామని పిలుపునిచ్చారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఐక్యతకు కృషి చేస్తూ... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదామన్నారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలని శ్రేణులకు సూచించారు. అంతకు ముందు ఎర్రన్న కాంస్య విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్‌, నిమ్మాడ సర్పంచ్‌ కింజరాపు సురేష్‌, చౌదరి నారాయణమూర్తి, వెలమల విజయలక్ష్మి, తర్ర రామక్రిష్ణ, బోయిన గోవిందరాజులు, గొండు లక్ష్మణరావు, హనుమంతు అప్పలరాజు పాల్గొన్నారు. 





Updated Date - 2021-02-24T05:28:53+05:30 IST