అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ నేడు

ABN , First Publish Date - 2021-11-15T16:58:00+05:30 IST

అన్ని రాష్ట్రాల సీఎంలలో నిర్మలా సీతారామన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ నేడు

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 3గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మరింత పెంపొందించేందుకు కేంద్రీకృత ఆలోచనలపై, పరస్పర సహకారంతో అంతర్గత పెట్టుబడి-ఆధారిత వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే విషయంలో ఉన్న అడ్డంకులపై చర్చించనున్నట్లు సమాచారం. పెట్టుబడి ప్రోత్సాహానికి అనుకూలమైన విధానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా తీసుకువచ్చిన సంస్కరణల అమలుకు, పట్టణ స్థానిక సంస్థల్లో అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసే అంశంపై కూడా చర్చ జరగనున్నట్లు సమచారం. 

Updated Date - 2021-11-15T16:58:00+05:30 IST