దివ్యాంగుడి హత్యకు నిరసనగా ర్యాలీ
ABN , First Publish Date - 2022-01-28T02:39:26+05:30 IST
ప్రకాశం జిల్లా టంగుటూరు మండ లం నిడమనూరులో జరిగిన దివ్యాంగుడు లక్ష్మీనారాయణ హత్యకు నిరసనగా గురువారం కావ
కావలి, జనవరి27: ప్రకాశం జిల్లా టంగుటూరు మండ లం నిడమనూరులో జరిగిన దివ్యాంగుడు లక్ష్మీనారాయణ హత్యకు నిరసనగా గురువారం కావలిలో దివ్యాంగులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో శీనానాయక్కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుడు లక్ష్మీనారాయణను వేధించి హత్య చేశారని, అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల న్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు షేక్ నాయబ్ రసూల్, డీ. వెంకట్రావు, పీ. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.