టీడీపీలో కొనసాగిన పథకాలను తిరిగి అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-06-29T05:52:33+05:30 IST
దుల్హన్ పథకంతో పాటు టీడీపీ హయాంలో ముస్లిం మైనార్టీలకు అమలు చేసిన పథకాలను తిరిగి కొనసాగించాలని సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేఽశారు.
టీడీపీలో కొనసాగిన పథకాలను తిరిగి అమలు చేయాలి
మాజీ ఎమ్మెల్యే బొండా డిమాండ్ ఫ ధర్నాచౌక్లో నిరసన దీక్ష
విద్యాధరపురం, జూన్ 28: దుల్హన్ పథకంతో పాటు టీడీపీ హయాంలో ముస్లిం మైనార్టీలకు అమలు చేసిన పథకాలను తిరిగి కొనసాగించాలని సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేఽశారు. మంగళవారం ధర్నా చౌక్లో ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి నిరసన దీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. చంద్రబాబు అమలు చేసిన పథ కాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముస్లింలను వైసీపీ ఓటు బ్యాంకుగానే వాడుకుంది తప్ప వారికి చేసిన మేలు ఏమీ లేదన్నారు. ముస్లింలకు మేలు జరగాలంటే మళ్లీ చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, మైనార్టీ నాయకులు జాన్వలీ, షేక్ అన్వర్, షేక్ గౌస్ బాషా, ఖాసిం, షరీఫ్, షేక్ షఫీ, మస్తాన్, ఫతావుల్లా, షేక్ బడేబాజీ, షేక్ కరీ ముల్లా, షేక్ ఆస్లం, అంజాద్, షేక్అన్వర్, షేక్ఆషా, సలీం, గౌసియా, చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు.