సాగుచట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం..!
ABN , First Publish Date - 2021-11-24T16:26:01+05:30 IST
సాగుచట్టాలను రద్దు చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశమవుతోందని..
న్యూఢిల్లీ: సాగుచట్టాలను రద్దు చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశమవుతున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ సమావేశంలోనే రైతు చట్టాలను రద్దు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపనుందని చెబుతున్నారు. అనంతరం చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ''సాగు చట్టాల రద్దు బిల్లు, 2021'' పేరుతో లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెడతారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత శుక్రవారంనాడు దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మూడు సాగుచట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనీస వేతనాల చట్టానికి (ఎంఎస్పీ)కి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ ఎజాండాలో ఉన్న 26 కొత్త బిల్లుల్లో 'సాగు చట్టాల రద్దు బిల్లు, 2021' కూడా ఉంది.