పిడుగుపడి తొమ్మిది గొర్రెలు మృతి
ABN , First Publish Date - 2022-06-25T05:36:20+05:30 IST
పిడుగుపడి తొమ్మిది గొర్రెలు మృతి
కోటబొమ్మాళి: పిడుగుపడి హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన బొల్ల పాపారావుకు సంబంధించిన తొమ్మిది గొర్రెలు మృతిచెందాయి. ఎత్తురాళ్ళపాడు సమీపంలోని పొలంలో ఉన్న గొర్రెల మందపై శుక్రవారం పిడుగుపడింది. దీంతో తొమ్మిది గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. నిమ్మాడ పశువైద్యాధికారి వెంకటరావు మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు.
దేవునల్తాడలో ఆవు...
వజ్రపుకొత్తూరు: దేవునల్తాడ పంచాయతీ సూర్యమణిపురం గ్రామానికి చెం దిన పైల సింహాచలానికి చెందిన ఆవు శుక్రవారం పిగుడుపాటుకు గురై మృత్యు వాత పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. పొలాల్లో మేస్తున్న ఆవుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఆవు ఖరీదు సుమారు రూ.40వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని సింహాచలం కోరుతున్నాడు.