నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-02T10:37:20+05:30 IST

నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

చిట్యాల, ఆగస్టు 1: బంధువుల వేదింపులు తట్టుకోలేక చిట్యాలలో ఓ మహిళ శనివారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బొడ్రాయి బజార్‌కు చెందిన కూరెళ్ళ సుజాత(35)కు, సమీప బంధువులకు భూ విషయంలో వివాదం నడుస్తోంది. దానికి సంబంధించి బంధువుల వేదిస్తున్నారనే మన స్థాపంతో శనివారం ఉదయం ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Updated Date - 2020-08-02T10:37:20+05:30 IST