మంథని గోదావరి తీరానికి చేరిన దేవతా విగ్రహాలు
ABN , First Publish Date - 2020-08-02T10:14:14+05:30 IST
మంథని గోదావరి తీరానికి చేరిన దేవతా విగ్రహాలు
మంథని, ఆగస్టు 1: మంథని గోదావరి నది తీరంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజల ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న పర్ణశాలలో ప్రతిష్టించే దేవతా విగ్రహాలు శనివారం మంథనికి చేరుకున్నాయి. భద్రాద్రి సమీపంలోని పర్ణశాల మాదిరిగానే గోదావరి నది తీరంలో పర్ణశాలను ఏర్పాటుచేయాలని వారు ఎప్పుడో సం కల్పించినప్పటికీ కొన్ని రాజకీయ మార్పుల కా రణంగా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మరోసారి పర్ణశాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వరంగల్లో ప్రత్యేకంగా త యారుచేయించిన శ్రీసీతారాములు, లక్ష్మణ, శ బరి, రావణుడు, మాయలేడీ విగ్రహాలను తె ప్పించారు. త్వరలో వీటిని అక్కడ నిర్మించే పర్ణశాలలో ప్రతిష్టించనున్నారు.