పరిశీలనలో కొత్త రైల్వే జోన్ బోర్డు’
ABN , First Publish Date - 2020-09-22T10:28:10+05:30 IST
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న కొత్త రైల్వే జోన్(దక్షిణ కోస్తా రైల్వే) రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని బోర్డు డిప్యూటీ డైరక్టర్(ఎఫిషియెన్సీ అండ్ రీసెర్చి) సునిల్ ప్రభాత్ తెలిపారు. విశాఖపట్నం
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న కొత్త రైల్వే జోన్(దక్షిణ కోస్తా రైల్వే) రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని బోర్డు డిప్యూటీ డైరక్టర్(ఎఫిషియెన్సీ అండ్ రీసెర్చి) సునిల్ ప్రభాత్ తెలిపారు.
విశాఖపట్నంలోని ఇసుకతోటకు చెందిన సామాజిక కార్యకర్త జగన్ మురానీ కొత్త రైల్వే జోన్ గురించి లేఖ రాయగా దానికి ఆయన స్పందించి సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఓఎస్డీని నియమించారని, సమగ్రమైన నివేదిక కూడా బోర్డుకు చేరిందని, పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.