సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-08-31T16:47:29+05:30 IST

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో మంగళవారం ఉదయం అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో మంగళవారం ఉదయం అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్కరోజే తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల 9 మందిని సుప్రీంకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో 9 మంది జడ్జీలుగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ఈ అపూర్వ వేడుకకు సుప్రీంకోర్టు అదనపు భవన ఆవరణంలోని ఆడిటోరియం వేదికయింది. సీజేఐ ఎన్‌వీ రమణ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయించారు.


ప్రమాణస్వీకారం చేసిన 9 మంది న్యాయమూర్తులు వీరే...

జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ మాధుర్య త్రివేది, జస్టిస్ శ్రీనర్సింహ తదితరులు ప్రమాణం చేస్తున్నారు. ఈ కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించడంతో సుప్రీంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సీజేఐతో కలిపితే 33కు చేరుతుంది. 

Updated Date - 2021-08-31T16:47:29+05:30 IST