దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-21T15:58:06+05:30 IST

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కరోనా కేసులు

ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 3,60,58,806కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 5.23% కాగా.. కరోనా నుంచి రికవరీ అయిన వారి రేటు ప్రస్తుతం 93.50%కి చేరింది. భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 20,18,825గా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 160.43 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. 9,692 మొత్తం ఒమైక్రాన్ కేసులు ఇప్పటివరకు కనుగొనబడ్డాయి. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు 71.15 కోట్లు కాగా.. గత 24 గంటల్లో 19,35,912 పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.


Updated Date - 2022-01-21T15:58:06+05:30 IST