ఒకే డోర్ నెంబరులో ఒక్కరికే నేతన్న నేస్తం
ABN , First Publish Date - 2020-05-30T11:00:58+05:30 IST
ఒకే డోర్ నెంబరులో ఎన్ని మగ్గాలు ఉన్నా ఒక్కరికే వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధి చేకూరుతుందని తిరుపతి జౌళి
మదనపల్లె అర్బన్, మే 29: ఒకే డోర్ నెంబరులో ఎన్ని మగ్గాలు ఉన్నా ఒక్కరికే వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధి చేకూరుతుందని తిరుపతి జౌళి శాఖ ఏడీ తిరుపాలయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మదనపల్లెలోని వైఎస్సార్ నగర్, అమ్మచెర్వుమిట్టలోని సచివాలయాల్లో వార్డు వలంటీర్లు,వార్డు సెక్రటరీ లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నలు తమకుల ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ పఽథకం చేనేత షెడ్లుకు లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు సెక్రటరీలు లోకేష్, సాయి, అశోక్, వెంకటేష్, వార్డు వలంటీర్లు పాల్గొన్నారు.