నెల్లూరు : బలవంతంగా దళితుల భూములు స్వాధీనంకు యత్నం!
ABN , First Publish Date - 2020-07-12T17:38:22+05:30 IST
నెల్లూరు : జిల్లాలోని వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో
నెల్లూరు : జిల్లాలోని వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో దళితుల భూముల వ్యవహారం గత నాలుగైదు రోజులు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దళితుల భూములను స్వాధీనం చేసుకునేందకు అధికారులు యత్నించారు. గ్రామస్తులు కొద్ది రోజులు గడువు కావాలని కోరడంతో అధికారులు వెనుదిరిగారు. ఓ వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ సీఎస్కు నోటీసులిచ్చినా.. మరోవైపు హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు యత్నిస్తుండటం గమనార్హం. అధికారులపై స్థానికులు, ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.