కమ్యునిస్ట్ యోధుడు పుచ్చలపల్లికి అవమానం
ABN , First Publish Date - 2020-10-30T16:24:42+05:30 IST
ప్రముఖ కమ్యునిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్యకి ఘోర అవమానం జరిగింది. విడవలూరులో గత ప్రభుత్వ హయాంలో ఆయన పేరుతో పార్కు నిర్మాణాన్ని చేపట్టారు.
నెల్లూరు: ప్రముఖ కమ్యునిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్యకి ఘోర అవమానం జరిగింది. విడవలూరులో గత ప్రభుత్వ హయాంలో ఆయన పేరుతో పార్కు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. పార్కు నిర్మాణం కూడా పూర్తిగా నిలిచిపోయింది. అదే ప్రాంతంలో ప్రస్తుతం సచివాలయ భవనం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. కమ్యూనిస్టు పార్టీల నేతలు, పుచ్చలపల్లి అభిమానులు ఆందోళనకు దిగారు. నిరాడంబర జీవితంతో... నిరంతరం ప్రజాపోరాటాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన పుచ్చలపల్లిని ప్రభుత్వం అవమానించడాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.