గ్యాస్ లీకై దంపతులు మృతి...కుమార్తె పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2021-11-22T14:20:24+05:30 IST

జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో విషాదం నెలకొంది.

గ్యాస్ లీకై దంపతులు మృతి...కుమార్తె పరిస్థితి విషమం

నెల్లూరు: జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఇంటిలోని గ్యాస్ లీకై దంపతులు ఇద్దరు మృతి చెందగా.... కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో హమ్ సద్దు భాష దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కుక్క అరవడంతో ఇంటి చుట్టు పక్కల వారు మేల్కొని తలుపులు తీయగా  దంపతులు విగతజీవవులుగా పడి ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని 108లో హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-22T14:20:24+05:30 IST