నెల్లూరు: ఆర్టీసీ బస్సులో కర్నాటక మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-03-05T13:30:31+05:30 IST
జిల్లాలోని అయ్యప్పగుడి సెంటర్ వద్ద బెంగుళూరు నుంచి నెల్లూరుకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఏడు బ్యాక్సుల కర్నాటక మద్యం పట్టుబడింది.
నెల్లూరు: జిల్లాలోని అయ్యప్పగుడి సెంటర్ వద్ద బెంగుళూరు నుంచి నెల్లూరుకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఏడు బాక్సుల కర్నాటక మద్యం పట్టుబడింది. వాటి విలువ రూ.2 లక్షలుగా తెలుస్తోంది. ఎస్ఈబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో తనిఖీలు చేస్తుండగా మద్యం పట్టుబడింది. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్ఈబీ బస్సు కండెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు.