టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-31T17:36:45+05:30 IST

జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ పార్టీ నేతలతో కలిసి జైలు

టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

నెల్లూరు: జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ పార్టీ నేతలతో కలిసి జైలు భరో కార్యక్రమానికి బయలుదేరారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అబ్దుల్ అజీజ్‌ను ఇంటి వద్దే నిర్బంధించారు. 




ఏపీలో జైలు భరో కార్యక్రమం ఉధృతంగా మారింది. రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జైలు భరోకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని రైతులకు బేడీలు వేయడంపై టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జైలు భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయా జిల్లాలో నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-31T17:36:45+05:30 IST