విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2022-09-29T05:12:19+05:30 IST
విధి నిర్వహణలో హోం గార్డులు నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి ఒక్కరూ ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని రాయలసీమ రీజనల్ కమాండెంట్ మహేష్కుమార్ అన్నారు.
రాయచోటిటౌన్, సెప్టెంబరు 28: విధి నిర్వహణలో హోం గార్డులు నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి ఒక్కరూ ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని రాయలసీమ రీజనల్ కమాండెంట్ మహేష్కుమార్ అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన హోంగార్డ్స్ కవాతును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందాలని, సమస్యలు ఏవై నా ఉంటే సబ్ డివిజనల్ ఇన్చార్జిల దృ ష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా హోంగార్డులు తమ సమస్య లను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లారు రిజర్వ్ ఇన్స్పె క్టర్ పెద్దయ్య, అన్నమయ్య జిల్లా సబ్ డివిజన్ హోంగార్డు ఇన్చా ర్జులు, హోంగార్డులు తదితరులు పాల్గొ న్నారు.