వైకుంఠధామాల నిర్మాణాల్లో నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-06-18T05:26:16+05:30 IST
వైకుంఠధామాల నిర్మాణాల్లో నిర్లక్ష్యం
- రంగారెడ్డి జిల్లాలో 17 గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు
- పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్ నోటీసుల జారీ
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): జిల్లాలో వైకుంఠదామాల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించిన 17 గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వ్యులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివా్సరెడ్డి తెలిపారు. ఆమనగల్లు మండలం సింగంపల్లి, చెన్నంపల్లి, చౌదరిగూడ మండలం తూంపల్లి, పెద్దఎల్కిచర్ల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు షోకోజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి, ఫరూక్నగర్ మండలం నేరేళ్లచెరువు, చిన్నచిల్కమర్రి, చౌదమ్మగుట్ట తండా, కడ్తా ల మండలం గోవిందపల్లి, గోవిందపల్లి తండా, రేఖ్యతండా, మాడ్గుల మం డలం అంతంపేట్, ఆరోపల్లి, తలకొండపల్లి మండలం వీరన్నపల్లి, తుమ్మ కుంటతండా, చుక్కాపూర్, గట్టుఇప్పలపల్లి పంచాయతీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.