అసోంలో వరదలు..487 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
ABN , First Publish Date - 2020-07-13T13:43:05+05:30 IST
అసోం రాష్ట్రంలో వరదలు గ్రామాలను ముంచెత్తడంతో వరద బాధితులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కాపాడి బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది....
గువాహటి (అసోం): అసోం రాష్ట్రంలో వరదలు గ్రామాలను ముంచెత్తడంతో వరద బాధితులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కాపాడి బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బార్పేట జిల్లాలోని ఓ గ్రామం వరద ముంపునకు గురవడంతో 487 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. అసోంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో 950 గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు మాస్క్ లు పంపిణీ చేసి, వారు సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. అసోంలోని జోర్హాట్, బోనగైగాం, కామెరూప్ మెట్రో, కామెరూప్ రూరల్, బక్సా, బార్పేట, కచర్, శివసాగర్, సోనిట్ పూర్, ధీమాజీ, తిన్ సుకియా ప్రాంతాల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. వరదబాధిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరద సహాయ పనులు చేపట్టారు. పుతిమర్రి, బేకి, ఐ, పహుమర నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి.