సముద్రంలో కూలిన నేవీ మిగ్‌

ABN , First Publish Date - 2020-11-28T07:52:17+05:30 IST

నౌకాదళానికి చెందిన ఓ మిగ్‌-29కే విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఓ పైలట్‌ గల్లంతవ్వగా.. మరో పైలట్‌ను నేవీ వర్గాలు కాపాడాయి. గల్లంతైన పైలట్‌ను కమాండర్‌ నిషాంత్‌ సింగ్‌గా గుర్తించారు

సముద్రంలో కూలిన నేవీ మిగ్‌

ఒక పైలట్‌ గల్లంతు.. 


న్యూఢిల్లీ, నవంబరు 27: నౌకాదళానికి చెందిన ఓ మిగ్‌-29కే విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఓ పైలట్‌ గల్లంతవ్వగా.. మరో పైలట్‌ను నేవీ వర్గాలు కాపాడాయి. గల్లంతైన పైలట్‌ను కమాండర్‌ నిషాంత్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన అరేబియా సముద్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా.. ఏడాది కాలంలో 3 మిగ్‌29కే విమానాలు నేలకూలాయి. 

Updated Date - 2020-11-28T07:52:17+05:30 IST