నేచర్ ఇండెక్స్ సంస్థ సర్వేలో ఏయూకు నాల్గవ స్థానం
ABN , First Publish Date - 2020-06-07T08:09:34+05:30 IST
నేచర్ ఇండెక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందని
వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రసాద్రెడ్డి వెల్లడి
ఏయూ క్యాంపస్, జూన్6: నేచర్ ఇండెక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందని ఇన్చార్జి వీసీ ప్రసాదరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది అందించిన సహకారంతో ఈ ర్యాంకును సాధించామన్నారు. ఏయూను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయనన్నారు.