బాలికలు హక్కులు తెలుసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-25T05:22:25+05:30 IST
సమాజంలో ప్రతి బాలిక చట్టపరమైన హక్కులు తెలుసుకోవాలని ఎంపీపీ బొండాడ మోహినీ వెంకన్నబాబు బాలికలకు సూచించారు.
ద్వారకాతిరుమల, జనవరి 24: సమాజంలో ప్రతి బాలిక చట్టపరమైన హక్కులు తెలుసుకోవాలని ఎంపీపీ బొండాడ మోహినీ వెంకన్నబాబు బాలికలకు సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని దొరసా నిపాడులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అవరోధా లను ధీటుగా ఎదుర్కొనేలా బాలికలు సంసిద్ధతతో ఉండాలన్నారు. పంగిడి గూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళా పోలీసులు మహమ్మద్ నసీమ్, దొప్పసాని లక్ష్మి, ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు, మానవ హారం నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు అల్లాడ హరేరామకృష్ణ, డిజె రాజు, కార్యదర్శి గౌతమి, వాసు,కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు: సమాజంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైనదని రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కె. శారదాంబ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మేజిస్ట్రేట్ శారదాంబ మాట్లాడుతూ ఆధునిక స మాజంలో మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. బాలిక చట్టాలను వివరించి, చట్టాలపై అవగాహన కలిగివుండాలన్నారు. హెచ్ఎం శ్యామలారాణి, న్యాయవాది వై.ప్రకాశరావు పాల్గొన్నారు.