జాతీయ జెండాకు అవమానం
ABN , First Publish Date - 2022-01-27T04:49:18+05:30 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగుర వేసిన జా తీయ జెండాకు అవమానం జరిగింది
కంభం, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగుర వేసిన జా తీయ జెండాకు అవమానం జరిగింది. స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో త్రివర్ణపతాకాన్ని అధికారులు ఎగు రవేశారు. అనంతరం జెండా పైనుంచి జారి కిందకు వేలాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా అటువైపు వచ్చి న కొందరు మీడియా ప్రతినిధులు కింద వేలాడుతున్న పతాకాన్ని ఫొటోలు వేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది చూసిన తర్వాత తిరిగి పతాకాన్ని యథా స్థానంలో పెట్టినట్లు తెలిసింది.