బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2022-07-04T07:17:39+05:30 IST
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్ర య్య అన్నారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన బీజేపీ ‘విజయ సంకల్ప యాత్ర’కు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివెళ్లారు.
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, జూలై 3: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్ర య్య అన్నారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన బీజేపీ ‘విజయ సంకల్ప యాత్ర’కు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివెళ్లారు. ప్రధాని మోదీ బహిరంగసభకు వెళ్లే వాహనాలను నాగారంలో రామచంద్రయ్య జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆద రించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొల్కపురి చిరంజీవి, బాలకృష్ణ, సోమేష్గౌడ్, కొమురవెల్లి, రమేష్, పాల్గొన్నారు.
- కోదాడలో బహిరంగ సభకు వెళ్లే వాహనాలను బీజేపీ పట్టణ అధ్యక్షుడు నకిరేకంటి జగన్మోహన్రావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన, వంగ వీటి శ్రీనివాసరావు, కనగాల నారాయణరావు, వంగాల పిచ్చయ్య, సాతు లూరి హనుమంతరావు, యశ్వంత్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
- ప్రధాని మోదీ బహిరంగ సభకు నడిగూడెం నుంచి బీజేపీ మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో లతీఫ్, వెంకన్న, రామయ్య, తదితరులు ఉన్నారు.
- తుంగతుర్తి మండల కేంద్రం నుంచి హైదరాబాద్ సభకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా ఆధ్వర్యంలో ప్రజలు తరలివెళ్లారు. సభకు తరలివెళ్లిన వారిలో నాయకులు గాజుల మహేం దర్, ఉప్పుల లింగయ్య, అంబటి రమేష్, నాగరాజు తదితరులు ఉన్నారు.
- మద్దిరాల మండల కేంద్రం నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాప రవికుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలివెళ్లారు. తరలి వెళ్లినవారిలో మండల అధ్యక్షుడు భూతం సాగర్యాదవ్, జలగం అచ్చ య్య, వడ్డాణం కిరణ్, బొమ్మెర వెంకన్న, మద్దెల శ్రీను, విక్రమాచారి, సతీష్, నరేష్గౌడ్, మహేష్, గంగాధర్, శేఖర్, రమేష్ పాల్గొన్నారు.
- సూర్యాపేట మండలం రామారం గ్రామం నుంచి బీజేపీ మండల అధ్యక్షుడు వెన్న శశిధర్రెడ్డి, జిల్లా నాయకుడు ఉప్పు శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో మోదీ సభకు వెళ్లారు. తరలివెళ్లిన వారిలో రామకృష్ణ, సైదులు, వెంకన్న తదితరులు ఉన్నారు.
- హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు నూతనకల్ నుంచి బీజేపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. తరలివెళ్లిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాప రవికుమార్, మద్ది సంజీవరెడ్డి, కొలిచెల్మ సోమలింగయ్య, లింగాల గోపి, అనంతుల పాపయ్య, బొల్క కిట్టు, మధు, భవాని, కృష్ణ తదితరులు ఉన్నారు.