ఏకాంత సేవగా నృసింహ జయంతి
ABN , First Publish Date - 2020-06-05T09:41:39+05:30 IST
వరాహ లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో, సింహాచల దేవస్థానానికి చెందిన నృశింహవనం (గోశాల)లోని గుట్టపై గల నృసింహస్వామి ..
సింహాచలం, జూన్ 4: వరాహ లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో, సింహాచల దేవస్థానానికి చెందిన నృశింహవనం (గోశాల)లోని గుట్టపై గల నృసింహస్వామి విగ్రహం వద్ద నృసింహ జయంతిని గురువారం ఏకాంత సేవగా నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు క్షేత్ర మహాత్మ్యంలోని నృసింహస్వామి ఆవిర్భావ ఘట్టాన్ని ఆలయ అధ్యాపకులు పారాయణం చేశారు. అలాగే తిరునక్షత్ర పూజలను కూడా ఏకాంత సేవగానే నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.