టీకా వేసినట్టే తెలియలేదు: నర్సు నివేదతో ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2021-03-01T17:01:18+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్...

టీకా వేసినట్టే తెలియలేదు: నర్సు నివేదతో ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో ఈరోజు కరోనా టీకా తొలిడోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలో ఒక నర్సు ప్రధానికి టీకా వేస్తూ కనిపిస్తున్నారు. పీ నివేద అనే ఈ నర్సు మోదీ తనతో ఏమన్నారో తెలియజేశారు. 


సర్ (ప్రధాని మోదీ) భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తొలి డోసు టీకా తీసుకున్నారు. రెండవ డోసు 28 రోజుల తరువాత ఇవ్వాల్సివుంది. టీకా తీసుకున్న తరువాత మోదీ తనకు టీకా వేసినట్టే తెలియలేదని ఆమెతో అన్నారు. కాగా నర్సు నివేద పుదుచ్చేరికి నివాసి. మోదీకి టీకా వేస్తున్నప్పుడు ఆయన వెనక కేరళకు చెందిన నర్సు ఉన్నారు. ప్రధాని మోదీకి టీకా వేయడంతో దేశ వ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.

Updated Date - 2021-03-01T17:01:18+05:30 IST