నీరజ్కు చూర్మా... సింధుకు ఐస్క్రీమ్... తినిపించిన ప్రధాని మోదీ!
ABN , First Publish Date - 2021-08-16T17:48:34+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ చుర్మా తినిపించారు. అదే ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మోదీ ఐస్క్రీమ్ తినిపించారు. ఒలింపిక్ చరిత్రలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన క్రీడాకారిణిగా సింధు ఘనత దక్కించుకున్నారు. ఈరోజు మోదీ భారత్ తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులను కలుసుకున్నారు. పంద్రాగస్టు వేడుకలకు ఈ క్రీడాకారులంతా హాజరయ్యారు.