వారంరోజులు నారాయణపూర్ రైల్వేగేటు మూసివేత
ABN , First Publish Date - 2021-06-18T05:21:38+05:30 IST
వారంరోజులు నారాయణపూర్ రైల్వేగేటు మూసివేత
తాండూరు రూరల్ : తాండూరు-మంతట్టి రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న పీర్పకీర్సాబ్ దర్గా సమీపంలో రైల్వేట్రాక్ మరమ్మతుల కారణంగా 12/ఇ కిలోమీటరు 67/24-26 డౌన్లైన్లో రైల్వేగేటు మార్గంలోని గేటును వారం రోజులపాటు మూసి వేయడం జరుగుతుందని రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఈనెల 18 నుంచి 24 వరకు రైల్వేట్రాక్ పనులు జరుగనున్నందున ఆ గేటు నుంచి నిత్యం ప్రయాణించే ఆయా గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. తాండూరు మండల పరిధిలోని వీర్శెట్టిపల్లి, నారాయణపూర్, గోనూరు, కాశీంపూర్, మంతట్టి, రెడ్డిఘనాపూర్, మల్కన్గిరి తదితర గ్రామాల ప్రజలు గమనించాలని అన్నారు. ఈ విషయమై ముందస్తుగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.