కన్నుల పండువగా నృసింహస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2021-10-19T06:03:58+05:30 IST
మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు.
మఠంపల్లి, అక్టోబరు 18: మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్యపూజలతో పాటు కల్యాణోత్సవంలో భాగంగా మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.