ఆ నాలుగు గ్రామాలపైనే చూపు
ABN , First Publish Date - 2021-04-10T05:10:05+05:30 IST
పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఎంపీపీ ఎవరనే దానిపైనే ఉంటుంది.
ఎంపీపీ ఎన్నికయ్యేది అక్కడే
నరసాపురం, ఏప్రిల్ 8 : పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఎంపీపీ ఎవరనే దానిపైనే ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారం ఇప్పటికే ఎవరో ఒకరి పేరు వినిపించినా ఫలితాలు వచ్చిన తరువాత మారే అవకాశం ఉంటుంది. ఇలాగే నరసాపురం మండలంలో సీతారాంపురం, రుస్తుంబాద, మల్లవరం, కొప్పర్రు గ్రామాలపై అందరి దృష్టి పడింది. ఈ నాలుగు చోట్ల ఎవరు గెలుస్తారో అన్న దానిపై పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల్లో ఎవరో ఒకరు ఎంపీపీ కానున్నారు. ఈసారి ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. ప్రధాన పార్టీలు ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో రాజకీయం అంతా ఆ నాలుగు గ్రామాల చుట్టూనే తిరుగుతోంది.