సీఎం జగన్పై నారా లోకేష్ ధ్వజం
ABN , First Publish Date - 2022-07-03T19:52:24+05:30 IST
Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్లుగా ఉద్యోగాలిచ్చి జనం ధనం వృథా చేస్తున్నారని
Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్లుగా ఉద్యోగాలిచ్చి జన ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు.
వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ఫోన్లు
‘‘మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు ? అనే రకం జగన్ మోహన్ రెడ్డి. జనం సొమ్ము దోపిడీ చేసేందుకు జగన్ ఆడని నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వలంటీర్లుగా పెట్టుకుని.. పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారు. వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. వాటి రీఛార్జీల ఖర్చు ప్రజల డబ్బే.’’ అని లోకేష్ తెలిపారు.
ప్రకటనల రూపంలో సాక్షికి రూ.300 కోట్లు
‘‘మూడేళ్ల పాలనలో సర్కారు ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం, రూ.300 కోట్లు సాక్షికి ప్రకటనల రూపంలో ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలని హుకుం జారీ చేసి మరికొన్ని రూ. కోట్లు గుంజేశారు. మొబైల్లో ఈ పేపర్ యాక్సెస్ వుండగా సాక్షి పత్రిక వేయించుకోవాలని నెలకి రూ.5.32 కోట్లు జగన్ ఆర్డర్ ఇచ్చేశారు. అంటే ఏడాదికి 63.84 కోట్లు. ’’ అని నారా లోకేష్ వివరించారు.