‘పరిశోధనల్లో మేథోసంపత్తి హక్కుల పాత్ర కీలకం’

ABN , First Publish Date - 2020-11-29T05:45:44+05:30 IST

పరిశోధనల్లో మేథోసంపత్తి హక్కులు కీలక పాత్ర పోషిస్తాయని, పేటెంట్‌ అనేది ఇతరులను నిరోధించడానికి ఒక ఆవిష్కర్తకు చట్టం ఇచ్చిన ప్రత్యేక హక్కు అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు.

‘పరిశోధనల్లో మేథోసంపత్తి హక్కుల పాత్ర కీలకం’

దివాన్‌చెరువు, నవంబరు 28: పరిశోధనల్లో మేథోసంపత్తి హక్కులు కీలక పాత్ర పోషిస్తాయని, పేటెంట్‌ అనేది ఇతరులను నిరోధించడానికి ఒక ఆవిష్కర్తకు చట్టం ఇచ్చిన ప్రత్యేక హక్కు అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు పేర్కొన్నారు. శనివారం ఫిజిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో వెబినార్‌ నిర్వహించారు. కన్వీనర్‌గా వై.సుష్మప్రియ, సిరీస్‌ సమన్వయకర్తగా వై.మనోజ్‌దేవా వ్యవహరించారు. న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ జీఆర్‌ రాఘవేందర్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌-డాక్టరేట్‌ కౌన్సిల్‌ నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌ ఫ్రొఫసర్‌ టి.రామకృష్ణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ విభాగ అచార్యుడు జీబీ రెడ్డి మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ కె.రమణేశ్వరి, అధ్యాపకులు ఎన్‌.శ్రీనివాససుబ్బారావు, ఎస్‌.రాజ్యలక్ష్మి, వి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:45:44+05:30 IST