నంబియూరులో చిరుతపులి సంచారం

ABN , First Publish Date - 2022-02-06T17:14:30+05:30 IST

ఈరోడ్‌ జిల్లా నంబియూరులో శుక్రవారం సాయంత్రం ఓ చిరుతపులి సంచరించింది. ఇటీవల ఆ ప్రాంతంలోని ఇళ్ళవద్ద కట్టిపడేసిన కోళ్లు, మేకలు మాయమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు

నంబియూరులో చిరుతపులి సంచారం

                               - రాత్రంతా స్థానికుల జాగారం


చెన్నై: ఈరోడ్‌ జిల్లా నంబియూరులో శుక్రవారం సాయంత్రం ఓ చిరుతపులి సంచరించింది. ఇటీవల ఆ ప్రాంతంలోని ఇళ్ళవద్ద కట్టిపడేసిన కోళ్లు, మేకలు మాయమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో నేలపై ఉన్న కాలి గుర్తులను పరిశీలించి ఆ గ్రామంలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం నంబియూరు సమీపం ఇరుకాలూరు గ్రామంలో చిరుతపులి గాండ్రిస్తున్న శబ్ధ్దం వినిపించడంతో స్థానికులు భీతిల్లారు. వెంటనే ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. వారు ఆ ప్రాంతానికి చేరుకోగానే చీకటి పడింది. దీంతో గ్రామస్థులు, అటవీ శాఖ సిబ్బంది రాత్రంతా టార్చిలైట్లు, సెల్‌ఫోన్లు పట్టుకుని చిరుతపులి కోసం గాలించారు. అయినా దాని జాడను కనుగొనలేకపోయారు.


Updated Date - 2022-02-06T17:14:30+05:30 IST