నేటి నుంచి పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-02-08T14:09:59+05:30 IST

జిల్లాలో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నల్గొండ: జిల్లాలో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు  నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.  మంత్రి జగదీష్ రెడ్డి ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. 8న స్వామి వారి కళ్యాణం, 9న శేషవాహన సేవ, 10న రాత్రి అగ్నిగుండాలు,11న దోపోత్సవం, 12న పుష్పోత్సవం,13న గ్రామోత్సవం నిర్వహించనున్నారు. నేటి నుంచి 13 వరకు ఆరు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. దాదాపు 680 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-02-08T14:09:59+05:30 IST