AP News: సజ్జల ఎందుకు మాట మార్చారు: ఆనంద్ బాబు

ABN , First Publish Date - 2022-08-12T17:13:33+05:30 IST

ఎంపీ గోరంట్ల చేసిన చిల్లర పనులను చూసి దేశం అసహ్యించుకుంటోందని నక్కా ఆనందబాబు అన్నారు.

AP News: సజ్జల ఎందుకు మాట మార్చారు: ఆనంద్ బాబు

గుంటూరు (Guntur): ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) చేసిన చిల్లర పనులను చూసి దేశం అసహ్యించుకుంటోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Anandababu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్న సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి డీజీపీని నివేదిక అడిగిందన్నారు. మాధవ్ నిస్సిగ్గుగా టీడీపీపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యునిగా ఉండటానికి అనర్హుడన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వాడుకుంటున్నారని, ప్రభుత్వ వైఫల్యాలన్ని పక్కదోవ పట్టించారని విమర్శించారు. చరిత్రలో ఏ పార్లమెంటేరియన్ ఇలా ప్రవర్తించలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో స్పందించటం లేదని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.

Updated Date - 2022-08-12T17:13:33+05:30 IST