నకిరేకల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే చిరుమర్తి
ABN , First Publish Date - 2022-08-07T06:25:26+05:30 IST
నకిరేకల్ పట్టణాన్ని సుందరీకరణ, అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య అన్నారు.
నకిరేకల్, చిట్యాల, ఆగస్టు 6: నకిరేకల్ పట్టణాన్ని సుందరీకరణ, అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లోని 7వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. డ్రైనేజీ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పట్టణంలో పారిశుధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నకిరేకల్ పట్టణానికి చెందిన కొండ రాధికకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మం జూరైన రూ.1లక్ష చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కు టుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. చిట్యాల మండల కేంద్రం లో నిర్వహించిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన ఆదిమల్లయ్య, ఎంపీపీ సునీత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.