నాగాలాండ్ లో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-05T01:20:48+05:30 IST

నాగాలాండ్ లో పెరిగిన కరోనా కేసులు

నాగాలాండ్ లో పెరిగిన కరోనా కేసులు

కోహిమా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ నాగాలాండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా మరో 22 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 80 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా సోకిన 22 మంది ఇటీవల చెన్నై నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి తిరిగి వచ్చారని మంత్రి వెల్లడించారు.

Updated Date - 2020-06-05T01:20:48+05:30 IST